
టీవీ9 నిధులను అక్రమంగా డ్రా చేసుకున్నారనే ఆరోపణల కేసులో ఆ చానల్ మాజీ
సీఈవో చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను
విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్
పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన
కోర్టు... తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలను విన్న
తర్వాత తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
Comments
Post a Comment