Skip to main content

మన్మోహన్ సింగ్- రాజన్ హయాంలో బ్యాంకుల పరిస్థితి అధ్వానం: అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్







యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో బ్యాంకుల పరిస్థితి దిగజారిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలహీన పరిస్థితికి వీరిద్దరే కారణమని ఆమె చెప్పారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ సదస్సులో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ‘రాజన్ చెపుతున్నమాటలు, ఆయన భావనలను విశ్వసిస్తున్నా. ఆయనను గౌరవిస్తున్నా. ఈరోజు నేను మీకు ఒక నిజం చెబుతున్నాను. ప్రధానిగా మన్మోహన్, ఆర్ బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో ప్రభుత్వ బ్యాంకులు బలహీనంగా మారాయన్నదాంట్లో సందేహం లేదు. ఆ సమయంలో ఎవరూ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.

2014 నాటికి పీఎస్ బీ వసూలు కాని రుణాలు పెరిగాయి
2011-12 లో వసూలు కాని రుణాలు  రూ.9,190 కోట్లు ఉండగా, 2013-14 నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్ బీఐ పేర్కొందని నిర్మల పేర్కొన్నారు. ‘2014 మే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే పీఎస్ బీల పరిస్థితి దిగజారిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నేను విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పలు రంగాల్లో ఉత్తేజం తెచ్చేందుకే కార్పొరేట్ టాక్స్ లో కోతను ప్రకటించాం.ఇది ద్రవ్య లోటును పెంచే ప్రమాదం ఉన్నప్పటికి ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించే లక్ష్యంగా నిర్ణయం అమలుకే మొగ్గు చూపాం’ అని వివరించారు.

యూపీఏ హయాంలో ఫోన్ చేస్తే రుణాలిచ్చారు


యూపీఏ తన హయాంలో రుణాలిచ్చే సమయంలో అనుసరించిన విధానాన్ని నిర్మల తూర్పార బట్టారు. రాజన్ హయాంలో కేవలం ఫోన్ కాల్స్ చేస్తేనే తమకు అనుకూలమైన  ప్రభుత్వ బ్యాంకులకు, సంస్థలకు రుణాలు ఇచ్చేవారని నిర్మలా శ్రోతల నవ్వుల మధ్య చెప్పారు. అప్పటి ప్రభుత్వ అసమర్థ విధాలనాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి నుంచి బయటపడటానికి తాము ప్రభుత్వం ఈక్విటీలను నమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...