Skip to main content

మన్మోహన్ సింగ్- రాజన్ హయాంలో బ్యాంకుల పరిస్థితి అధ్వానం: అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్







యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో బ్యాంకుల పరిస్థితి దిగజారిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలహీన పరిస్థితికి వీరిద్దరే కారణమని ఆమె చెప్పారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ సదస్సులో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ‘రాజన్ చెపుతున్నమాటలు, ఆయన భావనలను విశ్వసిస్తున్నా. ఆయనను గౌరవిస్తున్నా. ఈరోజు నేను మీకు ఒక నిజం చెబుతున్నాను. ప్రధానిగా మన్మోహన్, ఆర్ బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో ప్రభుత్వ బ్యాంకులు బలహీనంగా మారాయన్నదాంట్లో సందేహం లేదు. ఆ సమయంలో ఎవరూ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.

2014 నాటికి పీఎస్ బీ వసూలు కాని రుణాలు పెరిగాయి
2011-12 లో వసూలు కాని రుణాలు  రూ.9,190 కోట్లు ఉండగా, 2013-14 నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్ బీఐ పేర్కొందని నిర్మల పేర్కొన్నారు. ‘2014 మే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే పీఎస్ బీల పరిస్థితి దిగజారిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నేను విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పలు రంగాల్లో ఉత్తేజం తెచ్చేందుకే కార్పొరేట్ టాక్స్ లో కోతను ప్రకటించాం.ఇది ద్రవ్య లోటును పెంచే ప్రమాదం ఉన్నప్పటికి ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించే లక్ష్యంగా నిర్ణయం అమలుకే మొగ్గు చూపాం’ అని వివరించారు.

యూపీఏ హయాంలో ఫోన్ చేస్తే రుణాలిచ్చారు


యూపీఏ తన హయాంలో రుణాలిచ్చే సమయంలో అనుసరించిన విధానాన్ని నిర్మల తూర్పార బట్టారు. రాజన్ హయాంలో కేవలం ఫోన్ కాల్స్ చేస్తేనే తమకు అనుకూలమైన  ప్రభుత్వ బ్యాంకులకు, సంస్థలకు రుణాలు ఇచ్చేవారని నిర్మలా శ్రోతల నవ్వుల మధ్య చెప్పారు. అప్పటి ప్రభుత్వ అసమర్థ విధాలనాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి నుంచి బయటపడటానికి తాము ప్రభుత్వం ఈక్విటీలను నమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...