Skip to main content

మన్మోహన్ సింగ్- రాజన్ హయాంలో బ్యాంకుల పరిస్థితి అధ్వానం: అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్







యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో బ్యాంకుల పరిస్థితి దిగజారిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలహీన పరిస్థితికి వీరిద్దరే కారణమని ఆమె చెప్పారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ సదస్సులో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ‘రాజన్ చెపుతున్నమాటలు, ఆయన భావనలను విశ్వసిస్తున్నా. ఆయనను గౌరవిస్తున్నా. ఈరోజు నేను మీకు ఒక నిజం చెబుతున్నాను. ప్రధానిగా మన్మోహన్, ఆర్ బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో ప్రభుత్వ బ్యాంకులు బలహీనంగా మారాయన్నదాంట్లో సందేహం లేదు. ఆ సమయంలో ఎవరూ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.

2014 నాటికి పీఎస్ బీ వసూలు కాని రుణాలు పెరిగాయి
2011-12 లో వసూలు కాని రుణాలు  రూ.9,190 కోట్లు ఉండగా, 2013-14 నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్ బీఐ పేర్కొందని నిర్మల పేర్కొన్నారు. ‘2014 మే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే పీఎస్ బీల పరిస్థితి దిగజారిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నేను విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పలు రంగాల్లో ఉత్తేజం తెచ్చేందుకే కార్పొరేట్ టాక్స్ లో కోతను ప్రకటించాం.ఇది ద్రవ్య లోటును పెంచే ప్రమాదం ఉన్నప్పటికి ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించే లక్ష్యంగా నిర్ణయం అమలుకే మొగ్గు చూపాం’ అని వివరించారు.

యూపీఏ హయాంలో ఫోన్ చేస్తే రుణాలిచ్చారు


యూపీఏ తన హయాంలో రుణాలిచ్చే సమయంలో అనుసరించిన విధానాన్ని నిర్మల తూర్పార బట్టారు. రాజన్ హయాంలో కేవలం ఫోన్ కాల్స్ చేస్తేనే తమకు అనుకూలమైన  ప్రభుత్వ బ్యాంకులకు, సంస్థలకు రుణాలు ఇచ్చేవారని నిర్మలా శ్రోతల నవ్వుల మధ్య చెప్పారు. అప్పటి ప్రభుత్వ అసమర్థ విధాలనాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి నుంచి బయటపడటానికి తాము ప్రభుత్వం ఈక్విటీలను నమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...