Skip to main content

ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదు: అధికారులతో భేటీలో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ



సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని సీఎం మరోసారి తెల్చిచేప్పినట్టు తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో హైకోర్టు కార్మికులతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సాగిన భేటీ ముగిసింది. 

ఇప్పటికే సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేశామని, వారు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని జీతాలు పెంచమని ఎలా అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారట. నష్టాలకు ఆర్టీసీ యూనియన్లే కారణమని, నష్టాల్లో ఉన్న సంస్థలో జీతాలు పెంచమని ఏ కోర్టు చెప్పదని ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తోంది. 

ఆర్టీసీ దివాళ స్థితిని కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత అధికారులదే అని, యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని సీఎం అభిప్రాయపడ్డట్టు చెబుతున్నారు. ఆల్విన్ కంపెనీ లాకౌట్ అయితే ఎవరు మాత్రం ఏం చేశారని అధికారులను ఉద్దేశించి ప్రశ్నించారట. యూనియన్లు లేకుంటే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...