Skip to main content

రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ఒకే నెలలో రెండోసారి..

రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ఒకే నెలలో రెండోసారి..
వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.ఇదే నెలలో జగన్ రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం గమనార్హం. ఢిల్లీ పర్యటనకు వెళ్లేముందు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొననున్నారు.

ఇదిలా ఉంటే, గతంలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత జగన్.. ఆ వివరాలను వెల్లడించకపోవడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం మరోసారి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పర్యటన వివరాలను మీడియా ముందుకు వచ్చి చెప్పేంత ధైర్యం జగన్‌కు లేదని దేవినేని విమర్శించారు. ఇక ఎన్నికల ముందు కేంద్ర మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.