Skip to main content

జగన్ చేసిన పని కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారు?: వీహెచ్ విమర్శలు

 
 

ఆర్టీసి ఆస్తులను అమ్ముకునేందుకే ఆ సంస్థకు చెందిన కార్మికులను కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డుమీదకు తీసుకొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. వామపక్షాలు ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా నాంపల్లి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికుడికీ ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు, మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని వీహెచ్ నిలదీశారు.  ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందకపోతే వారి కుటుంబం ఎలా బతుకుంతుందని ప్రశ్నించారు. తాను ఒక్కడే బాగుండాలని, మిగతా వారందరూ ఇబ్బందులు పడాలని కేసీఆర్ భావిస్తున్నారా? అని నిలదీశారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.