Skip to main content

జగన్ చేసిన పని కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారు?: వీహెచ్ విమర్శలు

 
 

ఆర్టీసి ఆస్తులను అమ్ముకునేందుకే ఆ సంస్థకు చెందిన కార్మికులను కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డుమీదకు తీసుకొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. వామపక్షాలు ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా నాంపల్లి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికుడికీ ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు, మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని వీహెచ్ నిలదీశారు.  ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందకపోతే వారి కుటుంబం ఎలా బతుకుంతుందని ప్రశ్నించారు. తాను ఒక్కడే బాగుండాలని, మిగతా వారందరూ ఇబ్బందులు పడాలని కేసీఆర్ భావిస్తున్నారా? అని నిలదీశారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...