Skip to main content

తొలి 'రాఫెల్' కు టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీసిన రాజ్ నాథ్ సింగ్

 అత్యంత అధునాతన 'రాఫెల్' యుద్ధ విమానం ఇప్పుడు భారత్ అమ్ములపొదిలో చేరింది. ఈ ఫ్రెంచ్ తయారీ జెట్ ఫైటర్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు. వాయుసేన దినోత్సవంతో విజయదశమి కూడా కలిసిరావడంతో రాజ్ నాథ్ తొలి రాఫెల్ కు ఫ్రెంచ్ గడ్డపైనే ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆ యుద్ధ విహంగంపై కుంకుమ మిశ్రమంతో 'ఓం' అని రాశారు. అంతేకాదు, విమానం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీశారు.

ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వద్ద ఉన్న డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు చెందిన రాఫెల్ తయారీ యూనిట్ లో ఈ అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఒప్పందం ప్రకారం భారత్ కు డసాల్ట్ ఏవియేషన్ సంస్థ 36 రాఫెల్ యుద్ధ విమానాలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్ నాథ్ అందుకున్నది తొలి విమానం. దీనికున్న అద్భుత పోరాట సామర్థ్యాల దృష్ట్యా భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా వాయుశక్తిని సముపార్జించుకున్నట్టయింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...