Skip to main content

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చరణ్?

 


ప్రస్తుతం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది జూలై 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమాకి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తరువాత కొరటాలతోనే చరణ్ సినిమా వుంటుందనే టాక్ వినిపించింది.

తాజాగా విక్రమ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత విక్రమ్ కుమార్ ఒక మంచి లైన్ అనుకుని, చరణ్ కి చెప్పారట. ఆ లైన్ చరణ్ కి బాగా నచ్చినట్టుగా సమాచారం. పూర్తి స్క్రిప్ట్ ను తయారుచేసి వినిపించమని చరణ్ చెప్పడంతో, విక్రమ్ కుమార్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ తో చరణ్ ను విక్రమ్ కుమార్ ఒప్పించవలసి వుంది. మరి కొరటాల - విక్రమ్ కుమార్ లలో ఎవరితో ముందుగా చరణ్ సెట్స్ పైకి వెళతాడో చూడాలి. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...