శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి భక్తులు నేడు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేడు స్వామి వారి మూలవిరాట్ను తాకాల్సిన సూర్యకిరణాలు మేఘాల కారణంగా ప్రసరించలేదు. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో భానుడి కిరణాలు స్వామి వారి పాదాలను తాకలేకపోయాయి. రేపు కూడా సూర్యుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్ను తాకుతాయి. అయితే, ఇందుకు వాతావరణం కరుణించాల్సి ఉంటుంది.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment