Skip to main content

అయోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు కానుకగా ఇచ్చేద్దాం!: ముస్లిం మేధావుల పిలుపు

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య రామ మందిరం వివాదాస్పద భూమి కేసు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సెటిల్ మెంట్ చేసుకోవడమే మంచిదని ముస్లిం మేధావులు కొందరు తమ అంతరంగాన్ని బయటపెట్టారు. ఈ కేసులో ముస్లింల తరపు పిటిషన్ దారులు గెలుపొందినప్పటికీ... ఆ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడమే బెటర్ అని వారు తెలిపారు.

మరోవైపు, వీరు తమను తాము 'శాంతి కోసం భారత ముస్లింలు' అని పేర్కొన్నారు. వీరిలో ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ లెఫ్టినెంట్ జెనరల్ జమీర్ ఉద్దీన్ షా కూడా ఉన్నారు. ఆయన ఆర్మీ డిప్యూటీ చీఫ్ గా కూడా పని చేశారు.

ఈ సందర్భంగా జమీర్ ఉద్దీన్ షా మాట్లాడుతూ, 'వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వాస్తవవాదిని. ఒకవేళ ముస్లింలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినా... మనం అక్కడ మసీదును నిర్మించగలమా? నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తే... మసీదును నిర్మించుకోవడం అనేది ఎన్నటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది. ముస్లింలకు అనుకూలంగా తీర్పు వచ్చినా... ఆ భూమిని మెజారిటీ ప్రజలకు బహుమానంగా ఇవ్వడమే మంచిది' అని చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...