Skip to main content

అయోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు కానుకగా ఇచ్చేద్దాం!: ముస్లిం మేధావుల పిలుపు

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య రామ మందిరం వివాదాస్పద భూమి కేసు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సెటిల్ మెంట్ చేసుకోవడమే మంచిదని ముస్లిం మేధావులు కొందరు తమ అంతరంగాన్ని బయటపెట్టారు. ఈ కేసులో ముస్లింల తరపు పిటిషన్ దారులు గెలుపొందినప్పటికీ... ఆ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడమే బెటర్ అని వారు తెలిపారు.

మరోవైపు, వీరు తమను తాము 'శాంతి కోసం భారత ముస్లింలు' అని పేర్కొన్నారు. వీరిలో ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ లెఫ్టినెంట్ జెనరల్ జమీర్ ఉద్దీన్ షా కూడా ఉన్నారు. ఆయన ఆర్మీ డిప్యూటీ చీఫ్ గా కూడా పని చేశారు.

ఈ సందర్భంగా జమీర్ ఉద్దీన్ షా మాట్లాడుతూ, 'వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వాస్తవవాదిని. ఒకవేళ ముస్లింలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినా... మనం అక్కడ మసీదును నిర్మించగలమా? నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తే... మసీదును నిర్మించుకోవడం అనేది ఎన్నటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది. ముస్లింలకు అనుకూలంగా తీర్పు వచ్చినా... ఆ భూమిని మెజారిటీ ప్రజలకు బహుమానంగా ఇవ్వడమే మంచిది' అని చెప్పారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.