Skip to main content

భారతీయుడి కోసం అమెరికా ఎఫ్‌బీఐ వేట...పట్టిస్తే రూ.70 లక్షల బహుమతి

 


అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు ఓ భారతీయుడి కోసం వేటాడుతున్నారు. భార్యను హత్యచేసి స్వదేశానికి పరారయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడిని పట్టిస్తే 70 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తామని సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే...గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్‌కుమార్‌ పటేల్‌ (24), పాలక్‌ (21)లు దంపతులు. వీరిద్దరూ అమెరికాలోని హనోవర్‌ మేరీల్యాండ్‌లోని డంకిన్‌ డోనట్‌ స్టోర్‌లో పనిచేసేవారు. 2015 ఏప్రిల్‌లో పాలక్‌ స్టోర్‌లోని వంట గదిలో మృతదేహంగా కనిపించిది. ఆమె ఒంటిపై తీవ్రగాయాలు కనిపించాయి.

ఈ ఘటన జరిగిన రోజు నుంచి ఆమె భర్త భద్రేశ్‌కుమార్‌ కూడా కనిపించకుండా పోయాడు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌బీఐ స్టోర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. పాలక్‌ చనిపోవడానికి ముందు దంపతులు ఇద్దరూ స్టోర్‌ వంటగదిలోకి వెళ్లినట్లు అందులో రికార్డయి ఉంది. ఆ తర్వాత భద్రేశ్‌కుమార్‌ ఒక్కడే వంటగది నుంచి బయటకు రావడం కనిపించింది.

స్టోర్‌ నుంచి ఒక్కడే బయటకు వచ్చిన భద్రేశ్‌ కాలినడకన ఇంటికి చేరుకున్నాడు. తన వ్యక్తిగత సామాన్లు తీసుకుని సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లి పరారయ్యాడని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అతను భారత్‌లోనే ఉండి ఉండవచ్చన్న అనుమానంతో ఎఫ్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.