Skip to main content

భారతీయుడి కోసం అమెరికా ఎఫ్‌బీఐ వేట...పట్టిస్తే రూ.70 లక్షల బహుమతి

 


అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు ఓ భారతీయుడి కోసం వేటాడుతున్నారు. భార్యను హత్యచేసి స్వదేశానికి పరారయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడిని పట్టిస్తే 70 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తామని సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే...గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్‌కుమార్‌ పటేల్‌ (24), పాలక్‌ (21)లు దంపతులు. వీరిద్దరూ అమెరికాలోని హనోవర్‌ మేరీల్యాండ్‌లోని డంకిన్‌ డోనట్‌ స్టోర్‌లో పనిచేసేవారు. 2015 ఏప్రిల్‌లో పాలక్‌ స్టోర్‌లోని వంట గదిలో మృతదేహంగా కనిపించిది. ఆమె ఒంటిపై తీవ్రగాయాలు కనిపించాయి.

ఈ ఘటన జరిగిన రోజు నుంచి ఆమె భర్త భద్రేశ్‌కుమార్‌ కూడా కనిపించకుండా పోయాడు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌బీఐ స్టోర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. పాలక్‌ చనిపోవడానికి ముందు దంపతులు ఇద్దరూ స్టోర్‌ వంటగదిలోకి వెళ్లినట్లు అందులో రికార్డయి ఉంది. ఆ తర్వాత భద్రేశ్‌కుమార్‌ ఒక్కడే వంటగది నుంచి బయటకు రావడం కనిపించింది.

స్టోర్‌ నుంచి ఒక్కడే బయటకు వచ్చిన భద్రేశ్‌ కాలినడకన ఇంటికి చేరుకున్నాడు. తన వ్యక్తిగత సామాన్లు తీసుకుని సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లి పరారయ్యాడని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అతను భారత్‌లోనే ఉండి ఉండవచ్చన్న అనుమానంతో ఎఫ్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...