Skip to main content

మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ, బండ్ల గణేశ్ పై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి: పీవీపీ

 


ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని నిర్మాత పీవీపీ ఫిర్యాదు చేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ’టెంపర్’ సినిమా తీయడానికి చేసిన ఖర్చు నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ మధ్య కుంపటి రాజేసింది. ఈ నేపథ్యంలో తాను ఫైనాన్స్ చేసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు పీవీపీ మీడియాతో మాట్లాడారు.
 
‘ఈ సినిమాకోసం రూ.30 కోట్లు ఫైనాన్స్ చేస్తే అందులో రూ.23 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగతా రూ.7 కోట్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చారు కానీ, వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. ఐదేళ్లు గడిచినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మేము గణేశ్ పై లీగల్ చర్యలు చేపట్టాలనుకున్నాం, అదే చేశాం’ అని పీవీపీ అన్నారు.

అంతకు ముందు గణేశ్ చర్చలకోసం మనుషులను పంపిస్తూ.. బంజారాహిల్స్ కేసులో మాపై కేసు నమోదు చేయించాడు. ఈ సందర్భంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ ఆయనపై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి' అని పీవీపీ  పేర్కొన్నారు.

వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో గణేశ్ సంబంధాలపై పీవీపీ మాట్లాడుతూ ‘బొత్సకు బినామీ గణేశ్ అనే విషయం తెలియదు. దీనిపై వ్యాఖ్యానించను. ఈ వివాదంలో బొత్స నాతో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు’ అని తెలిపారు. 

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.