Skip to main content

మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ, బండ్ల గణేశ్ పై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి: పీవీపీ

 


ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని నిర్మాత పీవీపీ ఫిర్యాదు చేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ’టెంపర్’ సినిమా తీయడానికి చేసిన ఖర్చు నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ మధ్య కుంపటి రాజేసింది. ఈ నేపథ్యంలో తాను ఫైనాన్స్ చేసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు పీవీపీ మీడియాతో మాట్లాడారు.
 
‘ఈ సినిమాకోసం రూ.30 కోట్లు ఫైనాన్స్ చేస్తే అందులో రూ.23 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగతా రూ.7 కోట్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చారు కానీ, వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. ఐదేళ్లు గడిచినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మేము గణేశ్ పై లీగల్ చర్యలు చేపట్టాలనుకున్నాం, అదే చేశాం’ అని పీవీపీ అన్నారు.

అంతకు ముందు గణేశ్ చర్చలకోసం మనుషులను పంపిస్తూ.. బంజారాహిల్స్ కేసులో మాపై కేసు నమోదు చేయించాడు. ఈ సందర్భంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ ఆయనపై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి' అని పీవీపీ  పేర్కొన్నారు.

వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో గణేశ్ సంబంధాలపై పీవీపీ మాట్లాడుతూ ‘బొత్సకు బినామీ గణేశ్ అనే విషయం తెలియదు. దీనిపై వ్యాఖ్యానించను. ఈ వివాదంలో బొత్స నాతో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు’ అని తెలిపారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...