Skip to main content

మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ, బండ్ల గణేశ్ పై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి: పీవీపీ

 


ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని నిర్మాత పీవీపీ ఫిర్యాదు చేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ’టెంపర్’ సినిమా తీయడానికి చేసిన ఖర్చు నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ మధ్య కుంపటి రాజేసింది. ఈ నేపథ్యంలో తాను ఫైనాన్స్ చేసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు పీవీపీ మీడియాతో మాట్లాడారు.
 
‘ఈ సినిమాకోసం రూ.30 కోట్లు ఫైనాన్స్ చేస్తే అందులో రూ.23 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగతా రూ.7 కోట్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చారు కానీ, వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. ఐదేళ్లు గడిచినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మేము గణేశ్ పై లీగల్ చర్యలు చేపట్టాలనుకున్నాం, అదే చేశాం’ అని పీవీపీ అన్నారు.

అంతకు ముందు గణేశ్ చర్చలకోసం మనుషులను పంపిస్తూ.. బంజారాహిల్స్ కేసులో మాపై కేసు నమోదు చేయించాడు. ఈ సందర్భంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ ఆయనపై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి' అని పీవీపీ  పేర్కొన్నారు.

వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో గణేశ్ సంబంధాలపై పీవీపీ మాట్లాడుతూ ‘బొత్సకు బినామీ గణేశ్ అనే విషయం తెలియదు. దీనిపై వ్యాఖ్యానించను. ఈ వివాదంలో బొత్స నాతో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు’ అని తెలిపారు. 

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.