Skip to main content

50వేలమంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తారా?

ఏదైనా ఒక సంస్థ నష్టాల్లో ఉంటె ఆ సంస్థ నష్టాలను తగ్గించుకోవడానికి కొంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది. అది మాములు విషయమే. అందుకు ఎవరూ అడ్డు చెప్పరు. కానీ ఏకంగా ఒకేసారి 50వేలమంది ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రభుత్వంతో అనుబంధంగా పనిచేసే సంస్థలు కూడా ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన సంఘటనలు లేవు.
కానీ, మొదటిసారి తెలంగాణాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు సమ్మెపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు విధులకు హాజరైన 1200 మంది సిబ్బందిని మాత్రమే ఉద్యోగుల పరిగణిస్తామని, మిగతా వారిని విధుల నుంచి తొలగిస్తామని, వారు ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తింపబడరని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని, పండుగ సమయంలో ఇలా సమ్మె చేయడం వలన ఆర్టీసీకి మరింత నష్టం వస్తుందని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి అంటే ఇకపై ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు కూడా నడపాలని నిర్ణయించింది. తద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది.
అయితే, ఆర్టీసీ కార్మికులు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివి చాలా చూశామని, ఒకేసారి ఏ ప్రభుత్వం కూడా 50వేలమంది ఉగ్యోగులను తొలగించిన సంఘటనలు లేవని, ప్రజాస్వామ్య దేశంలో అది అసాధ్యం అని అన్నారు. సకలజన సమ్మె సమయంలో కూడా బతుకమ్మ, దసరా సంబరాలు జరిగాయని, అప్పుడు కూడా సకలజన సమ్మెలో పాల్గొన్నట్టు కార్మికులు తెలిపారు. ఆ సమయంలో ప్రజలకు కలగని ఇబ్బందులు ఇప్పుడు ఎలా కలుగుతాయని అన్నారు.
న్యాయపరంగానే తాము కూడా ముందుకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. రేపు సింగరేణి విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోకుండా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సింగరేణిలో ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి. వారిపై కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాలి. ఎందుకంటే కార్మిక సంఘాలు ఇకపై ఉండకూడదు అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. దీనిపై సింగరేణి కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.