Skip to main content

45 మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: మహారాష్ట్ర బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో బీజేపీ నేతలు అందుకు ఒప్పుకోవట్లేదు. ఈ విషయంపై బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'మహారాష్ట్రలో శివసేన నుంచి కొత్తగా ఎన్నికైన 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారు. వీరిలో కొంత మంది ఎమ్మెల్యేలు... శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు నచ్చజెప్పి ఒప్పిస్తారని, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాష్ట్రంలో మరో మార్గం ఉందని నేను భావించట్లేదు' అని సంజయ్ అన్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.