Skip to main content

40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తగ్గిన ఓజోన్ రంధ్రం పరిమాణం: నాసా



ప్రపంచం అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం వెనుకబడే ఉంది. సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేసే ఓజోన్ పొర వాతావరణ కాలుష్యం కారణంగా పాడైపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఈ ఏడాది తగ్గిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు చెప్పారు.

గత 40 ఏళ్లలో ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఎన్నడూ లేనంత అత్యల్పంగా ప్రస్తుతం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, రెండు నెలల్లో భూమి పై వాతావరణంలో వేడి ఉండడంతోనే ఓజోన్ పరిమాణం తగ్గిందని, అది పూర్తిగా కోలుకున్నట్లు భావించే పరిస్థితి లేదని వివరించారు.

ప్రతి ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో ఓజోన్ రంధ్రం దాదాపు 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రంధ్రం పరిమాణం ఈ సారి మాత్రం సగానికి (10 మిలియన్ చదరపు కి.మీ) తగ్గినట్లు చెప్పారు. ఉపగ్రహ డేటా ఆధారంగా నాసా, నోవా సంస్థలు ఈ విషయాన్ని తేల్చాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...