Skip to main content

40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తగ్గిన ఓజోన్ రంధ్రం పరిమాణం: నాసా



ప్రపంచం అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం వెనుకబడే ఉంది. సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేసే ఓజోన్ పొర వాతావరణ కాలుష్యం కారణంగా పాడైపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఈ ఏడాది తగ్గిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు చెప్పారు.

గత 40 ఏళ్లలో ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఎన్నడూ లేనంత అత్యల్పంగా ప్రస్తుతం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, రెండు నెలల్లో భూమి పై వాతావరణంలో వేడి ఉండడంతోనే ఓజోన్ పరిమాణం తగ్గిందని, అది పూర్తిగా కోలుకున్నట్లు భావించే పరిస్థితి లేదని వివరించారు.

ప్రతి ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో ఓజోన్ రంధ్రం దాదాపు 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రంధ్రం పరిమాణం ఈ సారి మాత్రం సగానికి (10 మిలియన్ చదరపు కి.మీ) తగ్గినట్లు చెప్పారు. ఉపగ్రహ డేటా ఆధారంగా నాసా, నోవా సంస్థలు ఈ విషయాన్ని తేల్చాయి.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.