Skip to main content

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?



ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అంతా చెబుతున్నా... ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా మారబోతోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సైరా సినిమాను చూడాలని కోరేందుకే చిరంజీవి సీఎం జగన్‌ను కలవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సమావేశంలో చిరంజీవి ముందు సీఎం జగన్... సీఎం జగన్ ముందుకు చిరంజీవి పలు ప్రతిపాదనలు పెట్టే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసలు సీఎం జగన్, చిరంజీవి సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది.

సైరాకు పన్ను మినహాయింపు: చారిత్రక కథాంశంతో తెరకెక్కిన సైరా సినిమాను చూడటంతో పాటు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని చిరంజీవి సీఎం జగన్‌ను కోరే అవకాశం ఉందని సమాచారం. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన అంశాన్ని చిరంజీవి జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే గంటా అంశం: టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరొచ్చని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిరంజీవి మార్గనిర్ధేశంలోనే ముందుకు సాగుతున్న గంటా శ్రీనివాసరావు అంశం కూడా జగన్, చిరంజీవి మధ్య భేటీలో చర్చకు రావొచ్చని సమాచారం.
రాజ్యసభ సీటు: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ జరుగుతుందన్న విషయం తెలియగానే... మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. కాంగ్రెస్ తరపున ఎంపీ అయిన చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఆఫర్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇరువురి మధ్య భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీకి రాయితీలు: ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌తో చిరంజీవి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగన్ కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో... ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ అంశంపై సీఎం జగన్‌తో చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఇరువురి భేటీలో చర్చకు రానున్నాయి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...