Skip to main content

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ... 4 కారణాలు ?



ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అంతా చెబుతున్నా... ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా మారబోతోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సైరా సినిమాను చూడాలని కోరేందుకే చిరంజీవి సీఎం జగన్‌ను కలవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సమావేశంలో చిరంజీవి ముందు సీఎం జగన్... సీఎం జగన్ ముందుకు చిరంజీవి పలు ప్రతిపాదనలు పెట్టే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసలు సీఎం జగన్, చిరంజీవి సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది.

సైరాకు పన్ను మినహాయింపు: చారిత్రక కథాంశంతో తెరకెక్కిన సైరా సినిమాను చూడటంతో పాటు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని చిరంజీవి సీఎం జగన్‌ను కోరే అవకాశం ఉందని సమాచారం. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన అంశాన్ని చిరంజీవి జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే గంటా అంశం: టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరొచ్చని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిరంజీవి మార్గనిర్ధేశంలోనే ముందుకు సాగుతున్న గంటా శ్రీనివాసరావు అంశం కూడా జగన్, చిరంజీవి మధ్య భేటీలో చర్చకు రావొచ్చని సమాచారం.
రాజ్యసభ సీటు: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ జరుగుతుందన్న విషయం తెలియగానే... మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. కాంగ్రెస్ తరపున ఎంపీ అయిన చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఆఫర్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇరువురి మధ్య భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీకి రాయితీలు: ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌తో చిరంజీవి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగన్ కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో... ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ అంశంపై సీఎం జగన్‌తో చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఇరువురి భేటీలో చర్చకు రానున్నాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...