Skip to main content

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న విశాఖలో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ

 


రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని భావిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఉపాధి లభించిక తీవ్ర ఇక్కట్లపాలవుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల పట్ల సంఘీభావంతో విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ ర్యాలీ నవంబరు 3 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ర్యాలీని పవన్ కల్యాణ్ ముందుండి నడిపిస్తారని జనసేన తన ప్రకటనలో పేర్కొంది. అయితే ర్యాలీ ఎక్కడి నుంచి నిర్వహించాలనేది ఇంకా ఖరారు కాలేదు. స్థానిక జనసేన నాయకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.