Skip to main content

బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌

 
బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఈ షో చివరి దశకు వచ్చేసింది. ప్రతి వారం హౌస్‌ నుంచి ఒక్కొక్కరూ ఎలిమినేట్‌ అవుతుండగా, ఈ వారం హాస్యనటుడు మహేశ్‌ విట్టా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. 
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టాలు నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న ముగ్గురూ బలమైన పోటీదారులే. అయితే, రాహుల్‌, వరుణ్‌లతో పోలిస్తే, మహేశ్‌కు కాస్త ఫాలోయింగ్‌ తక్కువ. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు మహేశ్‌కు పడటంతో ఈ వారం ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్‌, శివ జ్యోతి, రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితిక, అలీ రెజాలు మాత్రమే ఉన్నారు. అందరూ బలమైన పోటీదారులే.  ఈ నేపథ్యంలో వచ్చే వారం ఎవరెవరు నామినేట్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.