Skip to main content

బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌

 
బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఈ షో చివరి దశకు వచ్చేసింది. ప్రతి వారం హౌస్‌ నుంచి ఒక్కొక్కరూ ఎలిమినేట్‌ అవుతుండగా, ఈ వారం హాస్యనటుడు మహేశ్‌ విట్టా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. 
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టాలు నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న ముగ్గురూ బలమైన పోటీదారులే. అయితే, రాహుల్‌, వరుణ్‌లతో పోలిస్తే, మహేశ్‌కు కాస్త ఫాలోయింగ్‌ తక్కువ. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు మహేశ్‌కు పడటంతో ఈ వారం ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్‌, శివ జ్యోతి, రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితిక, అలీ రెజాలు మాత్రమే ఉన్నారు. అందరూ బలమైన పోటీదారులే.  ఈ నేపథ్యంలో వచ్చే వారం ఎవరెవరు నామినేట్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...