Skip to main content

బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌

 
బిగ్‌బాస్‌3: మహేశ్‌ ఎలిమినేట్‌
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఈ షో చివరి దశకు వచ్చేసింది. ప్రతి వారం హౌస్‌ నుంచి ఒక్కొక్కరూ ఎలిమినేట్‌ అవుతుండగా, ఈ వారం హాస్యనటుడు మహేశ్‌ విట్టా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. 
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మహేశ్‌ విట్టాలు నామినేట్‌ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న ముగ్గురూ బలమైన పోటీదారులే. అయితే, రాహుల్‌, వరుణ్‌లతో పోలిస్తే, మహేశ్‌కు కాస్త ఫాలోయింగ్‌ తక్కువ. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు మహేశ్‌కు పడటంతో ఈ వారం ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్‌, శివ జ్యోతి, రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితిక, అలీ రెజాలు మాత్రమే ఉన్నారు. అందరూ బలమైన పోటీదారులే.  ఈ నేపథ్యంలో వచ్చే వారం ఎవరెవరు నామినేట్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...