Skip to main content

రోజుకు రూ.33తో చేతికి రూ.4 లక్షలు.. ఇలా పొందండి!



  • ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండంకెల రాబడి
  • దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించాలి
  • కాంపౌండింగ్ ప్రయోజనంతో ఎక్కువ లాభం
  • దీంతో చిన్న మొత్తంతో ఎక్కువ రాబడి
చిన్న మొత్తంలో డబ్బుల్ని పెద్ద మొత్తంగా మార్చుకోవడం ఎలా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఉంటుంది. సంపద సృష్టించేందుకు ఒక ఆప్షన్ అందబాటులో ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కొనసాగుతున్నాయి.
అలాగే మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించడం ఇందుకు కారణం. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అధిక రాబడిని పొందొచ్చు.

ఎల్‌జే బిజినెస్ స్కూల్ మ్యూచువల్ ఫండ్ నిపుణుడు పూనమ్ రుంగ్టా మాట్లాడుతూ.. ‘మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.1,000 (రోజుకు దాదాపు రూ.33) ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా మీరు పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.1,20,000 అవుతుంది. దీనిపై మీకు రూ.1,82,946 రాబడి పొందొచ్చు. ఇలా మీరు మరో పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3.94 లక్షలు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 8 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం’ అని వివరించారు
క్రమంగా తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతూ వస్తుందని ఆయన తెలిపారు. ‘అలాగే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంపై వచ్చిన రాబడి కూడా మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తానికి కలుస్తుంది. దీంతో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం పెరుగుతుంది. దీనిపై మళ్లీ రాబడి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కారణంగా పదేళ్లకు పైన దీర్ఘకాలంలో రెండంకెల రాబడిని అందుకోవచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ మేనేజర్ కార్తీక్ ఝవేరి తెలిపారు. మ్యూచువల్ ఫండ్ సిప్ మార్గంలో కనీసం 12 శాతం రాబడి లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.