Skip to main content

రోజుకు రూ.33తో చేతికి రూ.4 లక్షలు.. ఇలా పొందండి!



  • ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండంకెల రాబడి
  • దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించాలి
  • కాంపౌండింగ్ ప్రయోజనంతో ఎక్కువ లాభం
  • దీంతో చిన్న మొత్తంతో ఎక్కువ రాబడి
చిన్న మొత్తంలో డబ్బుల్ని పెద్ద మొత్తంగా మార్చుకోవడం ఎలా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఉంటుంది. సంపద సృష్టించేందుకు ఒక ఆప్షన్ అందబాటులో ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కొనసాగుతున్నాయి.
అలాగే మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించడం ఇందుకు కారణం. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అధిక రాబడిని పొందొచ్చు.

ఎల్‌జే బిజినెస్ స్కూల్ మ్యూచువల్ ఫండ్ నిపుణుడు పూనమ్ రుంగ్టా మాట్లాడుతూ.. ‘మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.1,000 (రోజుకు దాదాపు రూ.33) ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా మీరు పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.1,20,000 అవుతుంది. దీనిపై మీకు రూ.1,82,946 రాబడి పొందొచ్చు. ఇలా మీరు మరో పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3.94 లక్షలు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 8 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం’ అని వివరించారు
క్రమంగా తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతూ వస్తుందని ఆయన తెలిపారు. ‘అలాగే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంపై వచ్చిన రాబడి కూడా మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తానికి కలుస్తుంది. దీంతో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం పెరుగుతుంది. దీనిపై మళ్లీ రాబడి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కారణంగా పదేళ్లకు పైన దీర్ఘకాలంలో రెండంకెల రాబడిని అందుకోవచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ మేనేజర్ కార్తీక్ ఝవేరి తెలిపారు. మ్యూచువల్ ఫండ్ సిప్ మార్గంలో కనీసం 12 శాతం రాబడి లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.