Skip to main content

జగన్ తండ్రి 26 కేసులు వేసి ఏం సాధించారు? నేను తప్పు చేయలేదు: చంద్రబాబు



తాను ఏ తప్పు చేయలేదని... అందుకే ఎవరికీ భయపడనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ తండ్రి తనపై 26 కేసులు వేశారని... అయినా సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరిచిపోనని... కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుగా పెడతానని చెప్పారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రజల ఆశీస్సులు పొందాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

ఇకపై పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులను కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని... కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని అన్నారు. జగన్ సర్కారు శాశ్వతం కాదనే నిజాన్ని పోలీసులు గ్రహించాలని చెప్పారు. మైనింగ్ గనులను ఇచ్చిన వ్యక్తి జగన్ సలహాదారుడిగా ఉన్నారని విమర్శించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.