Skip to main content

జగన్ తండ్రి 26 కేసులు వేసి ఏం సాధించారు? నేను తప్పు చేయలేదు: చంద్రబాబు



తాను ఏ తప్పు చేయలేదని... అందుకే ఎవరికీ భయపడనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ తండ్రి తనపై 26 కేసులు వేశారని... అయినా సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరిచిపోనని... కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుగా పెడతానని చెప్పారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రజల ఆశీస్సులు పొందాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

ఇకపై పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులను కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని... కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని అన్నారు. జగన్ సర్కారు శాశ్వతం కాదనే నిజాన్ని పోలీసులు గ్రహించాలని చెప్పారు. మైనింగ్ గనులను ఇచ్చిన వ్యక్తి జగన్ సలహాదారుడిగా ఉన్నారని విమర్శించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.