ఇప్పటికే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది. సాధారణ స్థాయి
కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ
చేసింది. హైదరాబాదులో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని
హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు
కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్ల నిన్న నగరంలో 40 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్
లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
హెచ్చరించింది.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment