ఇప్పటికే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది. సాధారణ స్థాయి
కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ
చేసింది. హైదరాబాదులో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని
హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు
కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్ల నిన్న నగరంలో 40 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్
లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
హెచ్చరించింది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment