ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు
కురుస్తున్నాయి. ఈ నెల 23న బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర మీదుగా
అల్పపీడనం ఏర్పడవచ్చని, తద్వారా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
కురుస్తాయని తాజా వాతావరణ హెచ్చరికలు చెబుతున్నాయి. నెల్లూరు, గుంటూరు,
కృష్ణా, ఉభయగోదావరి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం,
చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో
తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment