ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు
కురుస్తున్నాయి. ఈ నెల 23న బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర మీదుగా
అల్పపీడనం ఏర్పడవచ్చని, తద్వారా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
కురుస్తాయని తాజా వాతావరణ హెచ్చరికలు చెబుతున్నాయి. నెల్లూరు, గుంటూరు,
కృష్ణా, ఉభయగోదావరి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం,
చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో
తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment