ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు
కురుస్తున్నాయి. ఈ నెల 23న బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర మీదుగా
అల్పపీడనం ఏర్పడవచ్చని, తద్వారా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
కురుస్తాయని తాజా వాతావరణ హెచ్చరికలు చెబుతున్నాయి. నెల్లూరు, గుంటూరు,
కృష్ణా, ఉభయగోదావరి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం,
చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో
తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment