Skip to main content

1993లో తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ఒవైసీ



1993లో ఓ వ్యక్తికి ఇచ్చిన మాటను హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తన తండ్రి అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో ముస్లింల తరఫు కక్షిదారు జఫర్యాబ్‌ జిలానీ తాత్కాలికంగా ఉండేందుకు ఢిల్లీలోని తన నివాసాన్ని ఒవైసీ ఇచ్చారు.

లక్నో వాసి జిలానీకి సుప్రీంకోర్టులో వాదనల సమయంలో వచ్చినప్పుడు ఢిల్లీలో ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బందులు పడేవారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకి ఎప్పుడొచ్చినా తన ఇంట్లో ఉండాలంటూ ఆయనకు సుల్తాన్‌ సలావుద్దీన్‌ అప్పట్లో ఓ గది కేటాయించారు. సలావుద్దీన్‌ చనిపోయినప్పటికీ జిలానీకి అసదుద్దీన్ ఆ గదిలో వసతి కల్పిస్తున్నారు.

జిలానీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. 26 ఏళ్లుగా తాను ఢిల్లీ వచ్చినప్పుడు అసద్‌ నివాసంలోనే ఉంటున్నానని తెలిపారు. అంతేగాక, తనకు భోజనాన్ని కూడా అందిస్తున్నారని వివరించారు. కాగా, అయోధ్యలో వాదనల పూర్తికి ఈ రోజు సాయంత్రం వరకు సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. ముస్లిం కక్షిదారులు వాదనలు వినిపించేందుకు ఈ రోజు గంట సమయం కేటాయించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...