Skip to main content

టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ఈ నెల 15కు వాయిదా

టీఎస్సార్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి, ప్రభుత్వం తరపు న్యాయవాది రామచందర్ రావు, కార్మిక సంఘాల తరపు న్యాయవాది రచనారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలతో మరోమారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానానికి రచనారెడ్డి విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టారే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని అన్నారు. సమ్మె విషయమై ముందస్తుగా గత నెలలో మూడు సార్లు ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. కార్పొరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఉద్యోగుల జీతభత్యాలు తదితర కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే, కార్మికులు సమ్మెకు దిగారని న్యాయస్థానానికి వివరించారు.

గత నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, కార్మిక సంఘాలతో సంప్రదింపులకు సమయం ఇవ్వాలని కోరినా వారు పట్టించుకోలేదని న్యాయస్థానానికి రామచందర్ రావు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సునీల్ శర్మ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సమ్మెకు దిగారని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.