Skip to main content

టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ఈ నెల 15కు వాయిదా

టీఎస్సార్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి, ప్రభుత్వం తరపు న్యాయవాది రామచందర్ రావు, కార్మిక సంఘాల తరపు న్యాయవాది రచనారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలతో మరోమారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానానికి రచనారెడ్డి విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టారే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని అన్నారు. సమ్మె విషయమై ముందస్తుగా గత నెలలో మూడు సార్లు ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. కార్పొరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఉద్యోగుల జీతభత్యాలు తదితర కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే, కార్మికులు సమ్మెకు దిగారని న్యాయస్థానానికి వివరించారు.

గత నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, కార్మిక సంఘాలతో సంప్రదింపులకు సమయం ఇవ్వాలని కోరినా వారు పట్టించుకోలేదని న్యాయస్థానానికి రామచందర్ రావు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సునీల్ శర్మ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సమ్మెకు దిగారని అన్నారు.

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.