ఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ శుక్రవారం దిల్లీ కోర్టులో
ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో పాటు
మరో 13 మందిని నిందితులుగా పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధులు
సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఛార్జిషీట్లో
ఆరోపించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 21న
చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ దాదాపు ఎనిమిది వారాల పాటు ఆయన్ను
తిహార్ జైలులో ఉంచి విచారించిన విషయం తెలిసిందే. తాజాగా నగదు అక్రమ చలామణి
నిరోధక చట్టం కింద చిదంబరాన్ని బుధవారం ఈడీ అధికారులు అదుపులోకి
తీసుకున్నారు. గురువారం ఆయన జ్యుడిషియల్ కస్టడీని దిల్లీ కోర్టు అక్టోబర్
24వరకు పొడిగించింది. ఈ ఛార్జి షీట్లో చిదంబరంతో పాటు ఐఎన్ఎక్స్ మీడియా
అధిపతులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా, చిదంబరం కుమారుడు కార్తీ
చిదంబరంతో పాటు మరికొందరి పేర్లను పేర్కొంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment