Skip to main content

12 కొత్త జిల్లాలకే జగన్ పరిమితం: ఆ జిల్లాలు ఇవే....

గత కొన్ని రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక చర్చలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై  ప్రభుత్వ వర్గాలనుంచి వచ్చిన ఒక లీకు నేపథ్యంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం గురించి గవర్నర్ విశ్వభూషణ్ కు కూడా వివరించాడనే వార్త వెలుగులోకి రావడంతో నూతన జిల్లాల ఏర్పాటు ఖాయమని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే వార్త దాదాపుగా ఖచ్చితమని తేలేలా కనపడడంతో ఇప్పుడు చర్చ ఇంకాస్త ముందుకెళ్లి కొత్త జిల్లాలుగా వేటిని ప్రకటిస్తారనే కుతూహలం సర్వత్రా నెలకొంది. జగన్ ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఈ విషయమై అధికారంలోకి రాగానే అధికారులను ఈ విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వవలిసిందిగా ఆదేశించారు.
జగన్ ఆదేశాలను అందుకున్న అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు కూడా. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జనాభా నిష్పత్తి, నియోజకవర్గాల రేజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకొని నూతనంగా 12 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ నూతన 12 జిల్లాలతో కలుపుకొని 25 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్లమెంట్ స్థానాలు కూడా 25 కావడంతో జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని కూడా నెరవేర్చినట్టు అవుతుంది.
జగన్ సూచించిన పార్లమెంటు స్థానం ఆధారంగానే అధికారులు నియోజకవర్గాలను గ్రామ స్థాయి సరిహద్దుల వరకు వేరుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి అందుతున్న 'లీకు' సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటు చేయబోయే 12 జిల్లాలు ఇవే.
1. అనకాపల్లి
2. అరకు
3. అమలాపురం
4. రాజముండ్రి
5. నరసాపురం
6. విజయవాడ
7. నరసరావుపేట
8. బాపట్ల
9. నంద్యాల
10. రాజంపేట
11. హిందూపురం
12. తిరుపతి
నూతన జిల్లాల ఏర్పాటును దృష్టిలో ఉంచుకొనే జగన్ భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇలా నూతన జిల్లాల ఏర్పాటువల్ల పాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని భావిస్తోంది జగన్ సర్కార్. తాను ప్రవేశపెట్టిన నవరత్నాలను ఖచ్చితత్వంతో ప్రజలకు అందించేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని జగన్ ఆశిస్తున్నారు.
పాలనాపరమైన లాభాలతో పాటు ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకున్నవాడవుతాడు జగన్. కోల్డ్ స్టోరేజ్ లో పడకేసిన రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇది ఎంతో ఉపయుక్తకరంగా మారుతుంది. తద్వారా రాష్ట్ర ఖజానాకు కూడా ఆదాయం పెరుగుతుంది.
జనవరి 26వ తేదిన ఈ కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...