Skip to main content

రివర్స్’తో ఇప్పటివరకూ రూ.1000 కోట్ల ఆదా చేశాం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్


రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ విధానంలో సక్సెస్ అవుతున్నామని చెప్పారు. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనులు రూ.540 కోట్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని, దీంతో ప్రభుత్వానికి రూ.61 కోట్లకు పైగా ఆదా అయిందని చెప్పారు. ఇంకా నెల రోజుల్లో ఇరిగేషన్ శాఖ ద్వారా పదిహేను వందల కోట్లు ఆదా చేయబోతున్నట్టు చెప్పారు.

ఈ విధానంతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తే దాన్ని దోపిడీ అంటారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ విధానంపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఆదా చేస్తుంటే హర్షించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదు అని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.
ఏపీలో కొన్ని నెలలుగా నెలకొన్న ఇసుక కొరతపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదులకు వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత త్వరలోనే తీరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాల నుంచే మనకు ఇసుక వస్తోందని అన్నారు.

వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని, ‘ఆ భగవంతుడే వీళ్లను కాపాడాలి’ అని పేర్కొన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని విమర్శించారు. మొన్నటి వరకూ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన బాబు ఇప్పుడు యూ-టర్న్ తీసుకునేందుకు చూస్తున్నారని విమర్శించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...