Skip to main content

టీఎస్ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ నవంబర్ 1కి వాయిదా


 

తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికనేతల మధ్య చర్చల నేపథ్యంలో నిన్న విచారణ ప్రారంభించిన కోర్టు తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు విచారణను నవంబర్ 1కి వాయిదా వేసినట్లు ప్రకటించింది. కార్మికులకు బకాయి పడ్డ మొత్తానికి సంబంధించిన వివరాలను ఈ నెల 31లోపు కోర్టుకు తెలపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి కూడా నవంబర్ 1న జరిగే విచారణకు హాజరు కావాలని తెలిపింది.

మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు చెపుతున్న రూ.4,253 కోట్లలో రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే జీహెచ్ఎంసీ తాను చెల్లించాల్సిన రూ.335 కోట్లను చెల్లించిందా? అన్న విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం తెలపాలని ఆదేశించింది. తాను ఇస్తున్న వివరాలను పరిశీలించకుండానే ఆర్థికశాఖ కార్యదర్శి కోర్టుకు నివేదిక సమర్పించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.