Skip to main content

అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్


పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న ఆర్మీ చీఫ్... భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే LOC దాటి వెళ్లి మరీ యుద్ధం చేస్తామన్నారు.

అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్– News18 Teluguకిస్థాన్-భారత్ వాస్తవాధీన రేఖను దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. పాకిస్థాన్ తీరు మార్చుకోనంతవరకూ తమ దాడులు కొనసాగుతాయన్నారు ఆయన. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడిన ఆయన... ఇకపై "హైడ్ అండ్ సీక్‌"లు కుదరవన్న ఆయన... ఇండియా గనక సరిహద్దు దాటాలని అనుకుంటే... గగనతలంలో, భూ మార్గంలో లేదా రెండు మార్గాల్లోనూ దాటతామని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న ఆయన... పొరుగు దేశం కావాలనే ప్రచ్ఛన్న యుద్ధం జరిపిస్తోందని అన్నారు. అణ్వాయుద్ధాలతో యుద్ధం చేస్తామన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని కూడా బిపిన్ రావత్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ సమాజం అలాంటి చర్యల్ని అనుమతించదని అన్నారు. అణ్వాయుధాలనేవి రక్షణ కోసమే తప్ప యుద్ధం కోసం కాదన్నారు ఆయన. ఆగస్ట్ 5 తర్వాత సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగినట్లున్నాయి అన్న ప్రశ్నకు ఆర్మీ చీఫ్ అవునంటూనే... ఇండియన్ ఆర్మీ... అలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటోందనీ, అనుమానం ఉన్న ఏ ఒక్క అంశాన్నీ వదలట్లేదనీ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత... భారత్, పాకిస్థాన్ మధ్య టెన్షన్లు పెరిగాయన్నారు. కాశ్మీర్‌లోయలో పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు ఆయన... అత్యధిక శాతం ప్రజలు... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమ మేలు కోసమేనని గ్రహిస్తున్నారని తెలిపారు. 30 ఏళ్ల హింస తర్వాత... ప్రజలకు ఓ శాంతి అవకాశం దొరికిందన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.