Skip to main content

అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్


పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న ఆర్మీ చీఫ్... భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే LOC దాటి వెళ్లి మరీ యుద్ధం చేస్తామన్నారు.

అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్– News18 Teluguకిస్థాన్-భారత్ వాస్తవాధీన రేఖను దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. పాకిస్థాన్ తీరు మార్చుకోనంతవరకూ తమ దాడులు కొనసాగుతాయన్నారు ఆయన. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడిన ఆయన... ఇకపై "హైడ్ అండ్ సీక్‌"లు కుదరవన్న ఆయన... ఇండియా గనక సరిహద్దు దాటాలని అనుకుంటే... గగనతలంలో, భూ మార్గంలో లేదా రెండు మార్గాల్లోనూ దాటతామని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న ఆయన... పొరుగు దేశం కావాలనే ప్రచ్ఛన్న యుద్ధం జరిపిస్తోందని అన్నారు. అణ్వాయుద్ధాలతో యుద్ధం చేస్తామన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని కూడా బిపిన్ రావత్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ సమాజం అలాంటి చర్యల్ని అనుమతించదని అన్నారు. అణ్వాయుధాలనేవి రక్షణ కోసమే తప్ప యుద్ధం కోసం కాదన్నారు ఆయన. ఆగస్ట్ 5 తర్వాత సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగినట్లున్నాయి అన్న ప్రశ్నకు ఆర్మీ చీఫ్ అవునంటూనే... ఇండియన్ ఆర్మీ... అలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటోందనీ, అనుమానం ఉన్న ఏ ఒక్క అంశాన్నీ వదలట్లేదనీ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత... భారత్, పాకిస్థాన్ మధ్య టెన్షన్లు పెరిగాయన్నారు. కాశ్మీర్‌లోయలో పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు ఆయన... అత్యధిక శాతం ప్రజలు... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమ మేలు కోసమేనని గ్రహిస్తున్నారని తెలిపారు. 30 ఏళ్ల హింస తర్వాత... ప్రజలకు ఓ శాంతి అవకాశం దొరికిందన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...