టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినా ఆరోపణలు చేయడం అర్థరహితమని అన్నారు. 300 అడుగుల లోతున గోదావరిలో మునిగిన బోటును వెలికితీయడం కష్టంగా మారిందని, దాన్ని కూడా ప్రభుత్వ అసమర్థత కింద విమర్శలు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే అది చంద్రబాబు అసమర్థతేనా? అని ప్రశ్నించారు. దురదృష్టకర ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment