Skip to main content

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్దఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఉయ్యాలవాడ కుటుంబీకులు గత కొన్నిరోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఉయ్యాలవాడ కుటుంబీకులు ఇటీవల సైరా చిత్రంపై.. చిరంజీవి, రాంచరణ్ పై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ చేస్తున్న నేపథ్యంలో సెన్సార్ డైరెక్టర్ కోర్టుకు షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సైరా చిత్రానికి ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని అన్నారు. చిత్ర యూనిట్ కి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదని అన్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రం బయోపిక్ కాదని చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సైరాపై తమ నిర్ణయాన్ని ఈ నెల 30 లోగ చెబుతామని కోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. ఇదిలా ఉండగా తదుపరి విచరణని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు, సెన్సార్ బోర్డు సైరాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అని అభిమానుల్లో ఆందోళన మొదలయింది.

తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని నిర్మించి విడుదల చేసుకుంటున్నారని నరసింహారెడ్డి కుటుంబసభ్యులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంపై రాంచరణ్ గతంలో వివరణ ఇచ్చారు. 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఓ చరిత్ర కారుడి జీవితం చరిత్ర అవుతుంది. సుప్రీం కోర్టు నిబంధనలు కూడా ఉన్నాయి అని రాంచరణ్ తెలిపిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.