Skip to main content

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో తప్పిన ప్రమాదం!

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో వంట గ్యాస్ లీక్ అయింది. స్థానిక అర్జునవీధిలో దుర్గ గుడి ప్రసాదం పులిహోర తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకైన విషయం పసిగట్టిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గ్యాస్ వాల్వ్ ను కట్టేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. ప్రసాదం తయారీ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రసాదం తయారీ కేంద్రంలో దాదాపు 40 నిండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు సమాచారం. గ్యాస్ లీకైన సమాచారం మేరకు దుర్గగుడి ఈవో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

కాగా, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది. మహామండపంలోని ఆరో అంతస్తులో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నగరోత్సవం నిర్వహించనున్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...