Skip to main content

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో తప్పిన ప్రమాదం!

విజయవాడ కనకదుర్గ గుడి ప్రసాదం తయారీ కేంద్రంలో వంట గ్యాస్ లీక్ అయింది. స్థానిక అర్జునవీధిలో దుర్గ గుడి ప్రసాదం పులిహోర తయారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకైన విషయం పసిగట్టిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గ్యాస్ వాల్వ్ ను కట్టేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. ప్రసాదం తయారీ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ప్రసాదం తయారీ కేంద్రంలో దాదాపు 40 నిండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు సమాచారం. గ్యాస్ లీకైన సమాచారం మేరకు దుర్గగుడి ఈవో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

కాగా, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది. మహామండపంలోని ఆరో అంతస్తులో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నగరోత్సవం నిర్వహించనున్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.