ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని మహిళలు వేడుకొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని ఆందోళనకు దిగినందుకు మహిళలనీ కూడా చూడకుండా వారిని రోడ్డుపైకి ఈడ్చి కొట్టిస్తారా? ‘మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమ్మల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ గారూ!’ అంటూ విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లల్లో పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు ఉన్నారని మహిళలు చెబుతున్నా జగన్ కనికరించడం లేదని విమర్శించారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment