ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని మహిళలు వేడుకొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని ఆందోళనకు దిగినందుకు మహిళలనీ కూడా చూడకుండా వారిని రోడ్డుపైకి ఈడ్చి కొట్టిస్తారా? ‘మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమ్మల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ గారూ!’ అంటూ విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లల్లో పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు ఉన్నారని మహిళలు చెబుతున్నా జగన్ కనికరించడం లేదని విమర్శించారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment