Skip to main content

పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు... ఏపీ విద్యాశాఖ మంత్రి

Image result for adimulapu sureshపదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పరీక్ష విధానంలో కూడ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా వందమార్కుల పరీక్ష పేపరులో ఉండాల్సి బిట్ క్వశ్చన్ పేపరును ప్రత్యేకంగా ఇవ్వకుండా, జవాబు పత్రంతో పాటే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక పరీక్ష సమయాన్ని కూడ మరో 15 నిమిషాలు పొడగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విధానాలు రానున్న విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నట్టు మంత్రి తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవతరగతి పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. మాధ్యమిక విద్యావిధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించిన అనంతరం పలు నిర్ణయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇందులో భాగంగానే పదవ తరగతి పరీక్షలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల్లో కార్పోరేట్ పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే అభిప్రాయంతోనే వాటిని రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.