Skip to main content

విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి నాసా కీలక చిత్రాలు



విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించే పనిలో ఇస్రోకు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా సహకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7న చంద్రుడిపై దిగే సమయంలో విక్రమ్ ల్యాండర్‌‌తో చివరి క్షణాల్లో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి దాన్ని గుర్తించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రంగంలోకి దిగిన నాసా బృందం.. దాన్ని కనుగొనేందుకు తమవంతు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా విక్రమ్‌కు నిర్దేశించిన ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇవాళ నాసా టీమ్ విడుదల చేసింది. అయితే కాస్త చీకటి ఉండటం వల్ల విక్రమ్‌ను తాము గుర్తించలేకపోయామని.. అక్టోబర్‌లో మరిన్ని చిత్రాలు విడుదల చేస్తామని ట్విట్టర్‌లో పేర్కొంది.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.