Skip to main content

జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండగే పండుగ

జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండుగ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల లోపే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే కీలకమైన నిర్ణయాలు చాలావరకు అక్టోబర్ నెలలో అమలు కానున్నాయి. సమూల మార్పులు దిశగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇచ్చిన హామీల ప్రకారం అక్టోబర్ నెలలో ఏపీలో పండుగ వాతారణం నెలకొల్పేలా చేస్తున్నది.

ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. మొదటగా అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసలు ఆ పేరే వినిపించకుండా.. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా.. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేలా జగన్ తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది.

తద్వారా బెల్ట్‌ షాపులు లేకుండా చేసి మద్యం అమ్మకాలను తగ్గించి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది సీఎం కోరిక. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్‌ షాపులకు తెర పడదు. అందుకే ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

అలాగే ఏపీ ప్రభుత్వం ఇటీవల మూసేసిన "అన్న క్యాంటీన్లు" వైఎస్ఆర్ పేరుతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవనున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 2వ తేదీనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఇక అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు సాయం అందించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సొంతంగా ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్ల నడుపుకునే వారికి చేయూతను ఇస్తోంది ఈ పథకం. అక్టోబర్‌ 4వ తేదీనే సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ సాయం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆఫ్ లైన్‌, ఆన్‌ లైన్‌‌లతో పాటు నేరుగా మొత్తం ఇందుకోసం 1,75,218 దరఖాస్తుల వచ్చాయి.

అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రతీ ఇంట్లోని వ్యక్తులకు కంటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయబోతున్న కార్యక్రమం 'వైఎస్ఆర్ కంటి వెలుగు'. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.560 కోట్లు కేటాయించింది. 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అందిస్తారు.

ఇక జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకుని వచ్చిన మరో పథకం 'వైఎస్ఆర్ రైతు భరోసా' ఈ పథకం ద్వారా రూ.12వేలు రైతులకు అందించనుంది ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తూ విధివిధానాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అక్టోబర్ 15న అమలు కానుంది. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...