సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్ మదీనగూడలోని ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని ఆ అపార్ట్మెంట్లోనే నివసిస్తున్న తిరుపతిరావు కుమార్తె మహతి(28)గా గుర్తించారు. ఆమె గచ్చిబౌలిలోని టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం తన అక్కతో కలిసి కారులో బయటికి వెళ్లి వచ్చింది. అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగానే.. అక్కను కారులోనే ఉండమని చెప్పి ఐదో అంత స్తు ఎక్కిన మహతి అక్కడి నుంచి దూకింది. తలకు బలమైన గాయం కావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు కారణం వ్యక్తిగత సమస్యలా? కుటుంబ కలహాలా? ఉద్యోగపరమైన ఒత్తిళ్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment