సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్ మదీనగూడలోని ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని ఆ అపార్ట్మెంట్లోనే నివసిస్తున్న తిరుపతిరావు కుమార్తె మహతి(28)గా గుర్తించారు. ఆమె గచ్చిబౌలిలోని టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం తన అక్కతో కలిసి కారులో బయటికి వెళ్లి వచ్చింది. అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగానే.. అక్కను కారులోనే ఉండమని చెప్పి ఐదో అంత స్తు ఎక్కిన మహతి అక్కడి నుంచి దూకింది. తలకు బలమైన గాయం కావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు కారణం వ్యక్తిగత సమస్యలా? కుటుంబ కలహాలా? ఉద్యోగపరమైన ఒత్తిళ్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్ పిటిషన్లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.
Comments
Post a Comment