Skip to main content

గత ప్రభుత్వ విధానాలు మాకు గుదిబండలుగా మారాయి: మంత్రి బాలినేని వ్యాఖ్యలు


ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని అన్నారు. విద్యుత్ రంగాన్ని సరిదిద్దేందుకు సీఎం జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. అయితే, గత ప్రభుత్వం చేసిన పొరబాట్లు తమకు గుదిబండలుగా మారాయని ఆరోపించారు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ వస్తున్నామని బాలినేని తెలిపారు. 2019 మార్చి నాటికి రూ.20,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలన్నింటికి చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నామని ఆయన వివరించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.