ఏపీలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా స్పందించారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయని, థర్మల్ విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో కరెంటు కోతలు తప్పడంలేదని ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "క్షమించాలి, మా పనయిపోయింది" అంటూ ఏపీ సర్కారు ప్రజలకు ఈ విధంగా చెబుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా ట్వీట్ చేశారు. 'క్షీణించిపోతున్న బొగ్గు నిల్వలు: తెలంగాణ సీఎంను సాయం కోరిన జగన్' అంటూ ప్రచురితమైన కథనాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment