Skip to main content

చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్

Jagan vs Babu | చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్– News18 Telugu
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి బలం పుంజుకోవడానికి టానిక్ అందిస్తున్నారా? గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అందుకు ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మంగళం పాడడంతోపాటు కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూలగొట్టడానికి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం వంటివి పరిశీలిస్తే అవన్నీ చంద్రబాబుకు కలసివచ్చేలా ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి చివరి రెండు విడుతల చెక్కులకు జగన్ చెక్ పెట్టారు. 4, 5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్లను నిలుపుదల చేశారు. సెప్టెంబర్ 25న దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తుంది. కాబట్టి, పాతదాన్ని రద్దు చేశామని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సహజంగా రైతులు దేనికదే అనే భావనలో ఉంటారు. రుణమాఫీ హామీ ఐదేళ్ల క్రితం నాటిది. రైతు భరోసా ఎన్నికల ముందు నాటిది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి హామీకి సంబంధించిననిధులు చివరి నిమిషంలో నిలిపివేస్తే అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది.
ఇక కరకట్ట మీద చంద్రబాబు ఉంటున్న నివాసం ఖాళీ చేయాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. చంద్రబాబు ఇంటి విషయంలో జగన్ మోహన్ రెడ్డి మరీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని, కక్షగట్టి ఇల్లు కూల్చేదాకా వదిలిపెట్టేలా లేరనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. అది టీడీపీ ప్రచారం వల్ల అయినా కావొచ్చు. వైసీపీ ప్రభుత్వం దూకుడు వల్ల అయినా కావొచ్చు. జగన్ పర్సనల్ అజెండాను అమలు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేసుకోవడానికి ఓ అవకాశాన్ని సీఎం కల్పిస్తున్నారు. వీటితోపాటు ఇటీవల పల్నాడులో వైసీపీ బాధిత శిబిరానికి వెళ్లడానికి ప్రయత్నించిన చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం వంటివి కూడా టీడీపీ మీద ప్రజల్లో సానుకూలత, పాజిటివ్ అభిప్రాయాన్ని కల్పించే అవకాశాన్ని ఇచ్చేవే. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ఇలాంటి నిర్ణయాలే... కేవలం 23 సీట్లతో చతికిలపడిన టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి దారి చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అక్టోబర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో చర్చనీయాంశమైనవి, దుమారాన్ని రేకెత్తించే నిర్ణయాలతో జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి ఫుల్ టానిక్ ఇస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...