Skip to main content

చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్

Jagan vs Babu | చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్– News18 Telugu
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి బలం పుంజుకోవడానికి టానిక్ అందిస్తున్నారా? గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అందుకు ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మంగళం పాడడంతోపాటు కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూలగొట్టడానికి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం వంటివి పరిశీలిస్తే అవన్నీ చంద్రబాబుకు కలసివచ్చేలా ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి చివరి రెండు విడుతల చెక్కులకు జగన్ చెక్ పెట్టారు. 4, 5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్లను నిలుపుదల చేశారు. సెప్టెంబర్ 25న దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తుంది. కాబట్టి, పాతదాన్ని రద్దు చేశామని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సహజంగా రైతులు దేనికదే అనే భావనలో ఉంటారు. రుణమాఫీ హామీ ఐదేళ్ల క్రితం నాటిది. రైతు భరోసా ఎన్నికల ముందు నాటిది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి హామీకి సంబంధించిననిధులు చివరి నిమిషంలో నిలిపివేస్తే అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది.
ఇక కరకట్ట మీద చంద్రబాబు ఉంటున్న నివాసం ఖాళీ చేయాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. చంద్రబాబు ఇంటి విషయంలో జగన్ మోహన్ రెడ్డి మరీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని, కక్షగట్టి ఇల్లు కూల్చేదాకా వదిలిపెట్టేలా లేరనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. అది టీడీపీ ప్రచారం వల్ల అయినా కావొచ్చు. వైసీపీ ప్రభుత్వం దూకుడు వల్ల అయినా కావొచ్చు. జగన్ పర్సనల్ అజెండాను అమలు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేసుకోవడానికి ఓ అవకాశాన్ని సీఎం కల్పిస్తున్నారు. వీటితోపాటు ఇటీవల పల్నాడులో వైసీపీ బాధిత శిబిరానికి వెళ్లడానికి ప్రయత్నించిన చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం వంటివి కూడా టీడీపీ మీద ప్రజల్లో సానుకూలత, పాజిటివ్ అభిప్రాయాన్ని కల్పించే అవకాశాన్ని ఇచ్చేవే. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ఇలాంటి నిర్ణయాలే... కేవలం 23 సీట్లతో చతికిలపడిన టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి దారి చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అక్టోబర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో చర్చనీయాంశమైనవి, దుమారాన్ని రేకెత్తించే నిర్ణయాలతో జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి ఫుల్ టానిక్ ఇస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.