Skip to main content

చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్

Jagan vs Babu | చంద్రబాబు చేతికి ‘మూడు కత్తులు’ ఇచ్చిన సీఎం జగన్– News18 Telugu
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి బలం పుంజుకోవడానికి టానిక్ అందిస్తున్నారా? గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు అందుకు ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మంగళం పాడడంతోపాటు కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూలగొట్టడానికి జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం వంటివి పరిశీలిస్తే అవన్నీ చంద్రబాబుకు కలసివచ్చేలా ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి చివరి రెండు విడుతల చెక్కులకు జగన్ చెక్ పెట్టారు. 4, 5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్లను నిలుపుదల చేశారు. సెప్టెంబర్ 25న దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తుంది. కాబట్టి, పాతదాన్ని రద్దు చేశామని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సహజంగా రైతులు దేనికదే అనే భావనలో ఉంటారు. రుణమాఫీ హామీ ఐదేళ్ల క్రితం నాటిది. రైతు భరోసా ఎన్నికల ముందు నాటిది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి హామీకి సంబంధించిననిధులు చివరి నిమిషంలో నిలిపివేస్తే అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది.
ఇక కరకట్ట మీద చంద్రబాబు ఉంటున్న నివాసం ఖాళీ చేయాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. చంద్రబాబు ఇంటి విషయంలో జగన్ మోహన్ రెడ్డి మరీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని, కక్షగట్టి ఇల్లు కూల్చేదాకా వదిలిపెట్టేలా లేరనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. అది టీడీపీ ప్రచారం వల్ల అయినా కావొచ్చు. వైసీపీ ప్రభుత్వం దూకుడు వల్ల అయినా కావొచ్చు. జగన్ పర్సనల్ అజెండాను అమలు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేసుకోవడానికి ఓ అవకాశాన్ని సీఎం కల్పిస్తున్నారు. వీటితోపాటు ఇటీవల పల్నాడులో వైసీపీ బాధిత శిబిరానికి వెళ్లడానికి ప్రయత్నించిన చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం వంటివి కూడా టీడీపీ మీద ప్రజల్లో సానుకూలత, పాజిటివ్ అభిప్రాయాన్ని కల్పించే అవకాశాన్ని ఇచ్చేవే. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ఇలాంటి నిర్ణయాలే... కేవలం 23 సీట్లతో చతికిలపడిన టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి దారి చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అక్టోబర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో చర్చనీయాంశమైనవి, దుమారాన్ని రేకెత్తించే నిర్ణయాలతో జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి ఫుల్ టానిక్ ఇస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...