Skip to main content

వాల్తేరుతో కూడిన రైల్వే జోన్ కావాలి: రైల్వేజీఎంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

Ysrcp mp midhun reddy met railway gm, discuss on visakha railway zoneవాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి దాని నుంచి వాల్తేరు డివిజన్ ను తప్పించడం సరికాదన్నారు. 
విజయవాడలో రైల్వే జీఎంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అభివృద్ధి పనులపై ఏకరువు పెట్టారు ఎంపీలు. వాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
అలాగే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల అమలు చేయాలని, పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. 
కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్లపై కూడా చర్చించినట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సైతం వాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. 
మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని రైల్వే జీఎంతో భేటీని బాయ్ కాట్ చేశారు. ప్రతీ ఏడాది సమావేశాలు జరుగుతున్నాయే కానీ తాము చేసిన డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ సమావేశాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...