Skip to main content

పిపిఎల రద్దుపై జగన్ కు షాక్: జీవోను కొట్టేసిన హైకోర్టు

high court shocks to jagan government on ppa issues
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సమీక్షించేందుకు ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 63 జీవోను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఇప్పటికే పీపీఏలపై ఏపీ ప్రభుత్వం  తీరును కూడ కేంద్రం కూడ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
 చంద్రబాబునాయుడు సర్కార్   విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చకు రావాలని 63 జీవోను ఇచ్చింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
ఇప్పటివరకు నిర్ణయించిన ధరల ప్రకారంగానే ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని  కూడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.  భవిష్యత్తులో ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఏపీఈఆర్‌సీకి  కూడ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ వివాదాన్ని ఆరు మాసాల్లో పరిష్కరించాలని కూడ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం  అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని  జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమైకేంద్రం  కూడ  ఏపీ సర్కార్ తీరును తప్పుబట్టింది.
కేంద్ర మంత్రి కూడ ఇటీవల హైద్రాబాద్‌లో ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం పీపీఏలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై కేంద్రం  వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...