Skip to main content

పిపిఎల రద్దుపై జగన్ కు షాక్: జీవోను కొట్టేసిన హైకోర్టు

high court shocks to jagan government on ppa issues
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సమీక్షించేందుకు ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 63 జీవోను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఇప్పటికే పీపీఏలపై ఏపీ ప్రభుత్వం  తీరును కూడ కేంద్రం కూడ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
 చంద్రబాబునాయుడు సర్కార్   విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చకు రావాలని 63 జీవోను ఇచ్చింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
ఇప్పటివరకు నిర్ణయించిన ధరల ప్రకారంగానే ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని  కూడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.  భవిష్యత్తులో ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఏపీఈఆర్‌సీకి  కూడ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ వివాదాన్ని ఆరు మాసాల్లో పరిష్కరించాలని కూడ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం  అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని  జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమైకేంద్రం  కూడ  ఏపీ సర్కార్ తీరును తప్పుబట్టింది.
కేంద్ర మంత్రి కూడ ఇటీవల హైద్రాబాద్‌లో ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం పీపీఏలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై కేంద్రం  వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.