Skip to main content

పిపిఎల రద్దుపై జగన్ కు షాక్: జీవోను కొట్టేసిన హైకోర్టు

high court shocks to jagan government on ppa issues
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సమీక్షించేందుకు ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 63 జీవోను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఇప్పటికే పీపీఏలపై ఏపీ ప్రభుత్వం  తీరును కూడ కేంద్రం కూడ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
 చంద్రబాబునాయుడు సర్కార్   విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చకు రావాలని 63 జీవోను ఇచ్చింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
ఇప్పటివరకు నిర్ణయించిన ధరల ప్రకారంగానే ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని  కూడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.  భవిష్యత్తులో ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఏపీఈఆర్‌సీకి  కూడ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ వివాదాన్ని ఆరు మాసాల్లో పరిష్కరించాలని కూడ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం  అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని  జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమైకేంద్రం  కూడ  ఏపీ సర్కార్ తీరును తప్పుబట్టింది.
కేంద్ర మంత్రి కూడ ఇటీవల హైద్రాబాద్‌లో ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం పీపీఏలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై కేంద్రం  వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...