Skip to main content

పిపిఎల రద్దుపై జగన్ కు షాక్: జీవోను కొట్టేసిన హైకోర్టు

high court shocks to jagan government on ppa issues
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సమీక్షించేందుకు ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 63 జీవోను హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. ఇప్పటికే పీపీఏలపై ఏపీ ప్రభుత్వం  తీరును కూడ కేంద్రం కూడ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
 చంద్రబాబునాయుడు సర్కార్   విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చకు రావాలని 63 జీవోను ఇచ్చింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
ఇప్పటివరకు నిర్ణయించిన ధరల ప్రకారంగానే ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని  కూడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.  భవిష్యత్తులో ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ఏపీఈఆర్‌సీకి  కూడ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ వివాదాన్ని ఆరు మాసాల్లో పరిష్కరించాలని కూడ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం  అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని  జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమైకేంద్రం  కూడ  ఏపీ సర్కార్ తీరును తప్పుబట్టింది.
కేంద్ర మంత్రి కూడ ఇటీవల హైద్రాబాద్‌లో ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం పీపీఏలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై కేంద్రం  వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...