రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ ఉత్పాదన తగ్గిందని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా, విమర్శల తాకిడి తప్పడంలేదు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ ను కొనుగోలు చేయవచ్చు కదా అని కూడా స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా గత 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుదుత్పత్తి సరిగా లేదని తెలిపారు. వచ్చే 7 రోజుల పాటు 8 ర్యాకుల చొప్పున బొగ్గు సింగరేణి నుంచి వస్తోందని, కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లించామని వెల్లడించారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment