గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రెవిన్యూ రికార్డులను తారుమారు చేసిందనీ, రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్ని సమస్యలున్నా అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్షిప్లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్పైకి పంపే స్టార్ షిప్ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్ను తయారుచేసింది స్పేస్ ఎక...
Comments
Post a Comment