Skip to main content

రాజకీయాలు.. కమల్‌, రజనీకి చిరు సలహా ఇదే!

Stay Out Of Politics, Chiranjeevi Advises Rajinikanth, Kamal Haasan - Sakshi
‘మీరు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులైతే.. రాజకీయాల్లోకి రాకండి’.. ఇది మెగాస్టార్‌ చిరంజీవి తన తోటి నటులు రజనీకాంత్‌కమల్‌హాసన్‌కు ఇచ్చిన సందేశం. రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని ఆ ఇద్దరు నటులకు చిరంజీవి సూచించారు. తాజాగా ఆనంద వికటన్‌ అనే మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. తన రాజకీయ ప్రస్థానంతోపాటు పలు విషయాలను పంచుకున్నారు. సినీరంగంలో ‘నంబర్‌ వన్‌’ హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో తాను గతంలో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.‘రాజకీయం అంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. కోట్లాది రూపాయలు ఉపయోగించి నా సొంతం నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. ఇటీవలి ఎన్నికల్లో నా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ఇదే అనుభవం ఎదురైంది’ అని చిరు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కొనసాగాలంటే పరాజయాలను, అవమానాలను, అసంతృప్తలను దిగమింగుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ దృఢ సంకల్పం గలవారని, వారు రాజకీయాల్లో కొనసాగాలని నిశ్చయించుకుంటే.. అన్ని సవాళ్లను, అసంతృప్తులను ఎదుర్కొని..ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మంచి ఫలితాలను రాబడుతుందని ఆశించినప్పటికీ.. అది జరగలేదన్నారు. 2008 ఆగస్టులో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో 294 సీట్లలో పోటీ చేసి.. 18 స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీలో చేరారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...