Skip to main content

విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు

Image result for VIJAYASAI REDDYటెండరింగ్‌ ప్రకియ వల్ల చంద్రబాబు నాయుడు అవినీతి సాక్ష్యాధారలతో సహా బయటపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు.‘రివర్స్ టెండర్లతో మీ అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్పాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా.. బాబు. టెండర్లలో పాల్గొనవద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట.


మరి ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబు గారు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరంలో మూడు పనులకే ఇప్పటి వరకు టెండర్లు పూర్తయ్యాయని.. 50కి పైగా ఇరిగేషన్‌ పనులు టెండర్లకు రానున్నాయని విజయ్‌సాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు బానిసలు చూడాల్సింది ఇంకా చాలా ఉందని విజయ్‌సాయి రెడ్డి స్పష్టం చేశారు.పోలవరంలో మూడు పనులకే టెండర్లు పూర్తయ్యాయి. చంద్రబాబు బానిసలు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. విద్యుత్తు పీపీఏల సమీక్షతో ఏటా వేల కోట్లు ఆదా అవుతాయి. ఇంకా 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రానున్నాయి.ప్రజా ధనాన్ని ఇంత విచ్చల విడిగా, పబ్లిగ్గా దోచుకోవడం ఎక్కడా కనబడదు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఆరోపించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.