ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అంటూ.. వైసీపీ నేతలు తిరిగి విమర్శలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్దారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తామని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారన్నారు. వైసీపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అయ్యన్న హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ మంచి వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సుజల స్రవంతి టెండర్ రద్దు చేస్తుంటే ఆయన ఎందుకు అడ్డు చెప్పలేకపోయారని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment