Skip to main content

బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

Image result for AVANTHI SRINIVAS

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు ప్రమాదంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 
బోటు నిర్వాహకుడు కోడిగుట్ల వెంకటరమణ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బోటుకు అనుమతి వచ్చినట్లు అవంతి స్పష్టం చేశారు. 
ఇకపోతే గోదావరిపుష్కరాల సమయంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదానికి గురైన శ్రీవశిష్ఠ పున్నమి రాయల్ టూరిస్ట్ బోటులోనే ప్రయాణించారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ వాళ్లు బోటును ప్రారంభించి అందులో పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రయాణించారని తీరా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
తనకు బోటు వ్యాపారాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారని అదంతా కేవల దుష్ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. బోటు బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.