Skip to main content

బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

Image result for AVANTHI SRINIVAS

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు ప్రమాదంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 
బోటు నిర్వాహకుడు కోడిగుట్ల వెంకటరమణ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బోటుకు అనుమతి వచ్చినట్లు అవంతి స్పష్టం చేశారు. 
ఇకపోతే గోదావరిపుష్కరాల సమయంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదానికి గురైన శ్రీవశిష్ఠ పున్నమి రాయల్ టూరిస్ట్ బోటులోనే ప్రయాణించారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ వాళ్లు బోటును ప్రారంభించి అందులో పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రయాణించారని తీరా తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
తనకు బోటు వ్యాపారాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారని అదంతా కేవల దుష్ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. బోటు బాధితులకు ప్రభుత్వమే నష్టపరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లతో బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.