గోదావరిలో పడవ ప్రమాదానికి మంత్రి అవంతి శ్రీనివాసే కారకుడని టీడీపీ నేత మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. గోదావరిలో బోటు ముంచి ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. టీడీపీ చేసిన అభివృద్ధికి వైసీపీ వాళ్లు అవార్డు తీసుకోవడం శోచనీయం అని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో అవార్డు ఎవరి కృషి వల్ల వచ్చిందో ఆలోచించాలని అన్నారు. గోదావరికి ఉద్ధృతమైన వరద వస్తున్న సమయంలో బోటుకు ఎలా అనుమతినిచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మంతెన వ్యాఖ్యానించారు. బోటు మునిగి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు బోటును బయటికి తీయలేదని విమర్శించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment