Skip to main content

న్యూయార్క్‌లో పాక్‌కు షాక్‌

అమెరికా రాజధాని న్యూయార్క్‌లో శుక్రవారం ఉదయం రద్దీ వీధుల్లో, రహదారులపై.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు దర్శనమిచ్చాయి.


పాకిస్థాన్‌లో మైనారిటీలపై సాగుతున్న అరాచకాలు, అణచివేతపై గళమెత్తుతూ.. ట్యాక్సీలు, ట్రక్కులపై భారీ డిజిటల్‌ డిస్‌ప్లే ప్రకటనలు కనిపించాయి. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఒక్కసారిగా ఈ ప్రచారం హోరెత్తడం గమనార్హం. అమెరికాకు చెందిన హక్కుల సంస్థ వాయిస్‌ ఆఫ్‌ కరాచీ ఆధ్వర్యంలో పాక్‌ మైనారిటీల కోసం గళమెత్తుతూ న్యూయార్క్‌లో ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయం సమీపంలో ఈ ట్రక్కులు, ట్యాక్సీలు తిరుగుతూ కనిపించాయి. ‘ఐరాస ప్రవచించిన మానవ హక్కులు పాకిస్థాన్‌లో ఏమాత్రం అమలవ్వడం లేదు. పాక్‌ విషయంలో ఐరాస జోక్యం చేసుకోవాలని మొహజిర్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు’ అని ప్రకటనల్లో ఉంది. మైనారిటీలైన మొహజిర్స్‌కు పాక్‌లో ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, తమకు ఎదురవుతున్న అన్యాయాలు, అణచివేతపై కనీసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా మొహజిర్స్‌ను అనుమతించడం లేదని, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం, ఐరాస జోక్యం కోరుతూ ఈ ప్రచారం ప్రారంభించామని కరాచీ మాజీ మేయర్‌ వసే జలీల్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...