Skip to main content

న్యూయార్క్‌లో పాక్‌కు షాక్‌

అమెరికా రాజధాని న్యూయార్క్‌లో శుక్రవారం ఉదయం రద్దీ వీధుల్లో, రహదారులపై.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు దర్శనమిచ్చాయి.


పాకిస్థాన్‌లో మైనారిటీలపై సాగుతున్న అరాచకాలు, అణచివేతపై గళమెత్తుతూ.. ట్యాక్సీలు, ట్రక్కులపై భారీ డిజిటల్‌ డిస్‌ప్లే ప్రకటనలు కనిపించాయి. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఒక్కసారిగా ఈ ప్రచారం హోరెత్తడం గమనార్హం. అమెరికాకు చెందిన హక్కుల సంస్థ వాయిస్‌ ఆఫ్‌ కరాచీ ఆధ్వర్యంలో పాక్‌ మైనారిటీల కోసం గళమెత్తుతూ న్యూయార్క్‌లో ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయం సమీపంలో ఈ ట్రక్కులు, ట్యాక్సీలు తిరుగుతూ కనిపించాయి. ‘ఐరాస ప్రవచించిన మానవ హక్కులు పాకిస్థాన్‌లో ఏమాత్రం అమలవ్వడం లేదు. పాక్‌ విషయంలో ఐరాస జోక్యం చేసుకోవాలని మొహజిర్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు’ అని ప్రకటనల్లో ఉంది. మైనారిటీలైన మొహజిర్స్‌కు పాక్‌లో ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, తమకు ఎదురవుతున్న అన్యాయాలు, అణచివేతపై కనీసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా మొహజిర్స్‌ను అనుమతించడం లేదని, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం, ఐరాస జోక్యం కోరుతూ ఈ ప్రచారం ప్రారంభించామని కరాచీ మాజీ మేయర్‌ వసే జలీల్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...