వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప ప్రజా పాలన అందించడం లేదని, టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూన రవికుమార్ తో పాటు మరో 11 మంది వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ… కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రవిని కలిశామని, వైసీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపులు తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని చినరాజప్ప ఆరోపించారు.
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్ పిటిషన్లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.
Comments
Post a Comment