వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప ప్రజా పాలన అందించడం లేదని, టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూన రవికుమార్ తో పాటు మరో 11 మంది వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ… కూన రవికుమార్ పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రవిని కలిశామని, వైసీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపులు తప్ప సంక్షేమం పట్టదని విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని చినరాజప్ప ఆరోపించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment